ప్రభుత్వ స్థలం కబ్జాను అడ్డుకోండి: డీసీ, తహశీల్దార్ కు టీఆర్ఎస్ నేతల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ ఇంద్రారెడ్డి కాలనీలో చేపట్టిన అక్రమ కట్టడాలని అడ్డుకోవాలని టీఆర్ఎస్ నాయకులు సంగారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుదాంష్ కు, శేరిలింగంపల్లి తహశీల్దారు కు వేర్వేరుగా వినతి పత్రాలను అందజేశారు. హఫీజ్ పేట్ ఇంద్రారెడ్డి కాలనీలోని ప్రభుత్వ భూమిలో గల మినీ ఇండస్ట్రియల్ ప్రభుత్వ భూమిలో పలువురు అక్రమంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. సర్వే నం 98 ప్లాటు నం 9 లో అక్రమ నిర్మాణం సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను అడ్డుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో కె. జమీల్, ఎండీ చాంద్ పాషా, దిలీప్, పాండు, యాదగిరి, సంతోష్, సాజిద్, నరేందర్, శ్రీను, మల్లేశం తదితరులు ఉన్నారు.

డీసీ సుదాంష్ కు వినతి పత్రం అందజేస్తున్న టీఆర్ఎస్ నేతలు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here