శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): రాయదుర్గం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా తోట భూపతి శుక్రవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు డీఐగా బాధ్యతలు నిర్వహించిన భూపతి స్టేషన్ ఎస్హెచ్వోగా తాజా ఉత్తర్వులు వెలువైన నేపథ్యంలో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.






