భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి అద్భుతం: కసిరెడ్డి భాస్కర్ రెడ్డి

శేరిలింగంపల్లి‌‌ ‌‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అసంఘటిత కార్మికుల కోసం బిఎంఎస్ చేస్తున్న కృషి అమూల్యమైనదని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. జీ4 సెక్యూర్ సొల్యూషన్స్ మజ్దూర్ సంఘ్ జంట నగరాల క్యాలెండర్ ను అధ్యక్షుడు ఎం. సంజీవరెడ్డితో కలిసి భాస్కరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంఘటిత కార్మికులను లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకున్నదని, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం ఒక వరంలా కార్మికులకు తెలంగాణలో కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సంఘ్ నాయకులు మహాపాత్ర, బారిక్, రాజ్ జైశ్వాల్, దేవమని యాదవ్, బిఎంఎస్ కార్మికులు పాల్గొన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించిన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here