స్వచ్ఛ్ ఆటో కార్మికుల సేవలు అభినందనీయం – కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ స్వచ్ఛ్ ఆటో‌ కార్మికుల సేవలు అభినందనీయమని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ వార్డు కార్యాలయం వద్ద జీహెచ్ఎంసి స్వచ్ ఆటో కార్మికులతో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ సమావేశమయ్యారు. పరిశుభ్రత ‌కోసం స్వచ్ఛ్ ఆటో‌ కార్మికులు అందిస్తున్న సేవలను అభినందించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న స్వచ్ఛ్ ఆటోలకు జెండా ఊపి ప్రజలకు మరిన్ని సేవలందించి పరిశుభ్రతకు పాటుపడాలని‌ కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. పారిశుధ్య కార్మికులు, స్వచ్ ఆటో కార్మికులు కలిసి ప్రతి కాలనీని పరిశుభ్రంగా ఉంచడం వల్లే నగర ప్రజల దైనందనీయ జీవితం సాఫీగా సాగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏఎంహెచ్ఓ డా. నగేష్ నాయక్, శానిటేషన్ ఇన్ స్పెక్టర్ జలంధర్ రెడ్డి, శివ, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రక్తపు జంగంగౌడ్, నరసింహా సాగర్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి యాదవ్, సాయి శామ్యూల్ రాజు, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, రాజయ్య, కిష్టయ్య, రమేష్, నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here