శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పేదవాడు సొంత ఇంటి కోసం ఉద్యమాలు చేసే దుస్థితి ఉందని సిపిఐ రామకృష్ణ అన్నారు. సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం శ్రీ రామ్ నగర్ శాఖ 5వ మహాసభను ఎస్ కొండలయ్య అధ్యక్షతన సిపిఐ మండల కార్యాలయం ఇజ్జత్ నగర్ లో నిర్వహించారు. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా సిపిఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి టి రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పేదలకు ఇప్పటికీ ఇల్లు లేక ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఏ ప్రభుత్వాలు పరిపాలన చేసినా ఏమి మారెను పేదవాని బ్రతుకులు అని అన్నారు. శ్రీ రామ్ నగర్ లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కే చందు యాదవ్, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కే వెంకట స్వామి, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు కె సుధాకర్, బి నారాయణ, రఘు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.