శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): రుక్మిణి , సత్యభామ సమేత శ్రీకృష్ణ ఉత్సవ మూర్తుల బహూకరణ మహోత్సవంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. మియాపూర్ డివిజన్ AS రాజు నగర్ పార్కులో రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ భగవానుని పూజలో పాల్గొని కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఉత్సవ మూర్తులను పంపిణీ చేస్తూ హిందూ పురాణాలలో ముఖ్యమైన దేవుడు శ్రీకృష్ణుడని ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేస్తూ, కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ , రామరాజు, కేశవులు అరుణ్ కుమార్, గణేష్ ముదిరాజ్, అరవింద్ , వీరు యాదవ్, బాలాజీ, నర్సింగ్, రాము పాల్గొన్నారు.