శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): వరంగల్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలు, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్ల తో కలిసి భారీ సంఖ్యలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తరలివెళ్లారు. అంతకు ముందు ఖాజాగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం భారీ జన సందోహంతో డప్పుల చెప్పుళ్లతో, బాణసంచా కాల్చుకుంటూ భారీ ఎత్తున సభకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారాని, అతి త్వరలో మళ్ళీ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో గచ్చిబౌలి డివిజన్, కొండాపూర్ డివిజన్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, తెలంగాణ ఉద్యమ కారులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.