చందానగర్ హుడా ఫేజ్ – 2 లో మెగా ఉచిత వైద్యశిబిరం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ హుడా ఫేజ్ – 2 రెసిడెన్స్‌ వెల్పేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో మెడికవర్ చందానగర్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, కంటి, దంత, రక్తపోటు, షుగర్, పల్స్, ఈ.సీ.జీ., బీ. యం. డి. పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ నవీన్(కౌ డెంటల్), విజన్ ఐ కేర్ డాక్టర్ శిరీష వైద్యసేవలు అందించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు అని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం క‌నుక‌ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానం, నడక, కనీసం 40 నిమిషాలు చేయాని, సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో చందానగర్ హుడాకాలనీ ఫేజ్ – 2 వెల్పేర్ అసోసియేషన్ నాయకులు రాజయ్య, రమణారెడ్డి, సిద్దిరాములు, రామరాజు, విద్యాసాగర్, రామిరెడ్డి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొక్కుల జబర్ధన్, కౌడిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, పాలం శ్రీనివాస్, శివరామిరెడ్డి, పకీరయ్య, ఊరిటి వెంకటరావు, హాస్పిటల్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here