మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నే ప్ర‌ధాన ధ్యేయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీల గార్డెన్, జయప్రకాష్ నారాయణ నగర్, TN నగర్ కాలనీలలో రూ. 5 కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు, సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిరు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింద‌ని అన్నారు.

అందులో భాగంగా శ్రీల గార్డెన్ , జయప్రకాష్ నారాయణ నగర్, గురునాథం చెరువు నుండి పటేల్ చెరువు వరకు సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వ‌రద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామ‌ని తెలిపారు. మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామ‌ని అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here