శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీలో జరిగిన శ్రీ పద్మావతి అలర్మేలు మంగ సమేత శ్రీనివాస స్వామి వారి కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గులమోహర్ పార్క్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.