శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఆర్థికవేత్త , న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, వివక్షల పై అలుపెరుగని పోరాటం చేసిన ధీశాలి, భారత రాజ్యంగ నిర్మాత ,భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లో ఉన్న డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లడుతూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది అని అన్నారు. సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చందానగర్లో..
డా. బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో ఉన్న డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.