మహిళలకు స్వయం ఉపాధి కల్పన, ఆర్థిక స్వాలంబనే ధ్యేయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా ఉచితంగా 9 మంది క్రిస్టియన్ మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి 9 మంది లబ్దిదారులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా పథకం కింద క్రిస్టియన్ మైనార్టీ మ‌హిళ‌ల‌కు ఉచితంగా 9 మందికి కుట్టు మిషన్లు అందచేయడం చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. పేద మహిళల జీవితాలలో వెలుగులు నింపిన రోజు అని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం క‌ల్పిస్తుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నజియా బేగం, నాయకులు సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా, శివ ముదిరాజు, నరేష్, కార్యకర్తలు , మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here