శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): కుల గణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా ఇప్పుడు బిజెపి పార్టీ నిర్ణయం కులగణన జన గణన చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, బిజెపి పార్టీ అధికార ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.