శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ పరీక్ ప్లాజా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రుచి టిఫిన్స్ & స్నాక్స్ టిఫిన్ సెంటర్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని వినియోగదారులకు అందిస్తూ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఫిన్ సెంటర్ యాజమానులు అప్పారావు, వెంకటేశ్వరావు, వెంకట్ రావు, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, హరి గుప్త తదితరులు పాల్గొన్నారు.