టెలికాంనగర్‌లో డీఆర్ఎఫ్ శానిటైజేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌… అడుగ‌డుగునా క‌రోనా క్రిమి సంహారక మందు పిచికారి…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాంనగర్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ జిల్లా సహాయ కార్యదర్శి రవీందర్ రెడ్డి ఆ విష‌యాన్ని గ‌చ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి దృష్టి కి తీసికెళ్లారు. దీంతో స్పందించిన కార్పొరేట‌ర్ వెంట‌నే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. దీంతో డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. టెలికాంనగర్ లో అడుగడుగున కరోనా క్రిమి సంహారక మందును స్ప్రే చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోన ఉదృతి నేపథ్యంలో టెలికాం నగర్ వాసులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, అవసరం అయితే తప్ప బయటకి రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక‌ నాయకులు దినేష్ యాదవ్, మురళి పాల్గొన్నారు.

టెలికంన‌గ‌ర్ వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావ‌ణం పిచికారి చేస్తున్న డీఆర్ఎఫ్ సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here