శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో నూతనంగా ఏర్పాటు చేసిన తవక్కాల్ హోటల్ ను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా తవక్కాల్ హోటల్ యాజమాన్యం షేక్ రియాజ్, మొహ్మద్ అజార్ లకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట షేక్ ఇమామ్, అబ్దుల్ వసీం, షేక్ ఇలియాజ్, మొహ్మద్ అజాగర్, మొహ్మద్ ఫెరోజ్, మొహ్మద్ పాషా, ఇస్మాయిల్, అబ్దుల్ అహద్ తదితరులు ఉన్నారు.