అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల ఉత్సవాలు ప్రతీక అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ‌ఆరెకపూడి‌ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ శ్రీ తుల్జా భవాని దేవస్థానంలో బోనాల ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి గుడికి బోనాల నిధులు ప్రభుత్వం తరపున మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, కృష్ణ యాదవ్, నట్ రాజు, వెంకటేష్ గౌడ్, నాగరాజు, నరేందర్ బల్ల, హరీష్ రెడ్డి, మల్లేష్ గౌడ్, కార్తీక్ గౌడ్, సందీప్ రెడ్డి, దాస్ తదితరులు పాల్గొన్నారు.

తుల్జాభవాని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పలహార బండి ఊరేగింపులో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here