అజ్మీరా బాబీని సన్మానించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ద్రౌపది ముర్ము15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా తొలి ఆదివాసీ కమర్షియల్ పైలట్, బిజెపి ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు అజ్మీరా బాబీని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సన్మానించారు.ఈ సందర్భంగా అజ్మీరా బాబీకి భేటీ బచావో భేటీ పడావో నోట్ బుక్ ను బహుకరించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ భారత15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపదీ ముర్ము కు అభినందనలు తెలిపారు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. అదిలాబాద్ జిల్లాకు చెందిన అజ్మీరా బాబీ ఎన్నో కష్టాలను ఎదుర్కొని పోరాడి తొలి ఆదివాసీ మహిళ కమర్షియల్ పైలట్ గా చేయడం చాలా స్ఫూర్తి దాయకం అన్నారు. సమాజసేవ చేయడంలోనూ ఎప్పుడు ముందుంటారన్నారు. అజ్మీరా బాబీ మాట్లాడుతూ రవికుమార్ యాదవ్ ప్రజా సేవ చేయడంలో ఎప్పుడు ముందు ఉంటారని, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి ఇలాంటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టం అని కొనియాడారు. కార్యక్రమంలో నమో ప్రవీణ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ ఎస్టి మోర్చ ఆధ్యకులు హనుమంత్ నాయక్, జగదీష్ నాయక్, చింటు నాయక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అజ్మీరాబాబీని సన్మానించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here