వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి – వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు లక్ష్మయ్య

నమస్తే శేరిలింగంపల్లి: వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు ఎం. లక్ష్మయ్య అన్నారు. శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఏల సమస్యలపై స్పష్టమైన హామీనిచ్చి విస్మరించారన్నారు. వీఆర్ఏలకు ఫే స్కేల్ జీఓ, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వడం లేదన్నారు. 55సంవత్సరాలు పై బడిన వీఆర్ఏలకు వారి కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు పెరుగుతున్నా వీఆర్ఏలకు నామమాత్రంగా వేతనాలు చెల్లించడంతో చాలీచాలని జీతాలతో బతుకులు వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సి. శోభన్, కె. కృష్ణ, వీఆర్ఏలు లక్ష్మయ్య, రాజు, జమీర్, శరత్, కృష్ణ, రామకృష్ణ, గోపాల్, యాదయ్య, శ్రీకాంత్, శ్రీకాంత్ గౌడ్, ప్రసాద్, అంజి, బాబురావు, మహేష్, శ్రీనివాస్, భారతమ్మ, సురేష్, కుషాలయ్య, శ్రీనివాస్, చంద్రకళ తదితరులు ఉన్నారు.

శేరిలింగంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్ఏలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here