పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు – పట్టించుకోని అధికారులు

నమస్తే శేరిలింగంపల్లి: ఓ‌ వైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తుంటే మరో వైపు అధికారుల నిర్లక్ష్యంతో ఇష్టారీతిగా పగలనక, రాత్రనక వీధి లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని దూబే కాలనీలో పది రోజుల నుంచి విద్యుత్ వీధి దీపాలు పగలనక, రాత్రనక వెలుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి కూడా సరిగా పనిచేయని వీధి దీపాలను పట్టించుకోని అధికారులు పగలు కూడా నిరంతరాయంగా వీధి దీపాలు వెలగడం చూసి ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. దూబే కాలనీలో వెలుగుతున్న వీధి దీపాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మా కాలనీలో రాత్రి వేళల్లో విద్యుత్ వీధి దీపాలు సక్రమంగా వెలిగితే చాలు పట్టపగలు అవసరం లేదని, అధికారులు నిర్లక్ష్యం వీడి వీధి దీపాలపై శ్రద్ధ వహించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

దూబే కాలనీ పట్టపగలు వెలుగుతున్న వీధి దీపాలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here