అలరింపజేసిన మొహినియాట్టం నృత్యప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సోమవారం డాక్టర్ మైథిలి అనూప్ కైశికి ఏ ఫెస్టివల్ అఫ్ మొహినియాట్టం నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. ఏకదంతం గణేశా కీర్తన, చొల్కెట్టు, రీతు సంహారం, పరిపాహిమామ్ హరే, అష్టలక్ష్మి, కురుతే, కనకమయం, బాల మురళి కృష్ణ తిల్లాన అంశాలను ప్రదర్శించారు. డాక్టర్ మైథిలి అనూప్, శ్రీజ గోపకుమార్, షేర్ల, అవంతిక అనూప్, సంగీత నాయర్, ఉన్నతి తివారి, గోపిక గోపం, శ్రీలక్ష్మి మురళి, మనీష, శివగంగ, మేఘ విజయం లు ప్రదర్శించి మెప్పించారు. ముఖ్య అతిథిగా కూచిపూడి నాట్య కళాకారిణి డాక్టర్ దీపికారెడ్డి, సివీ హరిహరన్ హాజరై నృత్యప్రదర్శనతో అలరించిన కళాకారులను అభినందించారు.

శిల్పారామంలో కళాకారుల నృత్యప్రదర్శనలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here