వీధి దీపాల సమస్యపై ప్రత్యేక దృష్టి – చందానగర్ ‌కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న విద్యుత్ వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.చందానగర్ ‌డివిజన్ పరిధిలో వీధి దీపాలు,‌ విద్యుత్ స్తంబాలు తదితర సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు లేని పలు కాలనీలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విద్యుత్ దీపాల సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని, స్తంభాలు లేనిచోట కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా కాలనీలలో ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, పార్కులు ఉన్న చోట్ల విద్యుత్ దీపాల సంఖ్యను పెంచాలని కోరారు. సమావేశంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు డీఈ సునిల్, ఏఈ రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలపై అధికారులతో మాట్లాడుతున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here