ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, జూన్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఆదర్శ్ నగర్ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అడుగులు వేస్తున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆదర్శ్ నగర్ లో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్ తో కలిసి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన వెంటనే సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అభివృద్ధి పనుల‌లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని, అధికార యంత్రాంగం నిత్యం పనులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల‌ను అధికారులతోపాటు ప్రజలు దృష్టిసారించాల‌ని కోరారు. అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషి, నిర్ణయాలతో డివిజన్ లో సమస్యలన్నీ పరిష్కరించుకుందామని, అభివృద్ధిలో ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుకున్నామని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమదాస్, ఆదర్శ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సత్యనారాయణ, రమేష్, నరసింహారెడ్డి, కృష్ణ గౌడ్, సత్యం, నరసింహ, పవన్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here