సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి దిశ‌గా రాష్ట్రం: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మే 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని డీసీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చైర్మన్ చల్లా నర్సింహ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం, పథకం ప్రజలకు చేరేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రతిఒక్కరి బాధ్యతగా ముందుకు సాగాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలుస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

మదీనాగూడ కిన్నెర గ్రాండ్ హోటల్ లో టీపీసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి నేతృత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వారు పాల్గొని పార్టీ శ్రేణుల‌కు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here