మాదాపూర్‌లో ఉత్సాహంగా భారీ తిరంగా ర్యాలీ

శేరిలింగంప‌ల్లి, మే 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మాదాపూర్ డివిజన్ పరిధిలో కంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యానికి మద్దతుగా తెలుగు రాష్ట్రాల ప్రజల గౌరవాన్ని వ్యక్తపరిచేలా బీజేపీ, ఇతర పార్టీ నేతలు కలిసి ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నారు. మాదాపూర్ NAC గ్రౌండ్స్ గేట్ వద్దనుంచి జాతీయ జెండాలు చేతపట్టి ఈ విజయోత్స‌వ యాత్రను దేశ భక్తి నినాదాల హోరుతో కొన‌సాగించారు. భారత సైనికులకు మద్దతుగా మెటల్ చార్మినార్ వరకు నిర్వహించారు. అనంతరం ర్యాలీ లో పాల్గొన్న వారందరూ ట్యాంక్ బండ్ చేరుకొని ఈ యాత్ర ని ముగించారు.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని జరిగిన‌ ఈ ర్యాలీ జాతీయతా స్పూర్తిని బలపరిచే కార్యక్రమంగా నిలుస్తుంద‌ని గంగల రాధాకృష్ణ యాదవ్ అన్నారు. దేశ స్ఫూర్తిని మనలో కలిగించే ఈ తిరంగా యాత్ర తన అధ్యక్షతన నిర్వహించి దేశం పట్ల తనకున్న ప్రేమను భక్తిని చాటుకునే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి , శివ యాదవ్ , ఆనంద్ , సుమన్ నాయక్ , శీను నాయక్ , కృష్ణ గౌడ్ , వి నరసింహ యాదవ్ , కురుమయ్య , పవన్ , బాలు నాయక్ , జయదేవ్ తివారి , నరేష్ రెడ్డి , జగన్ యాదవ్ , సూర్యవంశం , లింగస్వామి , మళ్లీ యాదవ్, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here