శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): పదో తరగతి ఫలితాల్లో శ్రీ విద్యాస్ అభ్యాసన ది స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 600 లకు గాను 590 మార్కులతో వి.దీక్షిక మొదటి స్థానంలో నిలవగా, 550 కి పైగా మార్కులతో ముగ్గురు విద్యార్థులు, 500 కు పైగా మార్కులతో ఎనిమిది మంది విద్యార్థులు, 400కు పైగా మార్కులతో 12 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. కాగా పాఠశాల ప్రారంభించిన మొదటి పదో తరగతి బృందం నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులను, వారికై నిరంతరం ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు సీఈవో చైతన్య కృష్ణ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫలితాలకు ఉపాధ్యాయుల నిరంతర కృషి, ప్రత్యేక ప్రణాళిక, తల్లిదండ్రుల సహకారంతో సాధ్యమైందని తెలిపారు. విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, అంకిత భావంతో సహా అత్యుత్తమ ఉపాధ్యాయ బృందం ఎల్లవేళలా మద్దతు ఇచ్చే తల్లిదండ్రుల సహకారంతో ఈ అద్భుతమైన విద్యా ఫలితాలను సాధించారని తెలిపారు. ఈ విజయం మా ఉపాధ్యాయుల అవిశ్రాంత నిబద్ధతకు నిదర్శనం అని వారు మా విద్యార్థులకు ప్రతీ అడుగులోనూ మార్గ నిర్దేశం చేసి మార్గదర్శకత్వం వహించి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి ఎం నరేష్, ప్రిన్సిపల్ నాగవల్లి, డీన్ సంతోష్ పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.