శేరిలింగంపల్లి, మే 1 (నమస్తే శేరిలింగంపల్లి): మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకొని సిఈ ఆఫీస్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు, సైబర్ సిటీ సెక్రెటరీ హెచ్. శ్యాంసుందర్, గచ్చిబౌలి డివిజన్ సెక్రెటరీ వై వి రామ్ రెడ్డి, కొండాపూర్ డివిజన్ సెక్రెటరీ రాజేందర్ నాయక్, కొండాపూర్ డివిజన్ ట్రెజరర్ ఆర్ యాదయ్య, కూకట్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ రామ్ చందర్, కూకట్పల్లి డివిజన్ సెక్రెటరీ ఎస్. రమేష్, ఇబ్రహీం బాగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ , నరేందర్, లక్ష్మణ్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు.