గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి.. ఎమ్మెల్యే గాంధీకి కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి విన‌తి..

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని, డివిజన్ లో నెలకొన్న పలు సమస్య‌లను పరిష్కరించాలని, అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని, డివిజన్ లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల‌ను పూర్తి చేయాల‌ని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర‌చాలని, వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గాంధీని వినతి పత్రం ద్వారా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు.

ఎమ్మెల్యే గాంధీకి విన‌తిప‌త్రం అందజేస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి త‌న‌ శాయశక్తులా కృషి చేస్తానని, డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, త్వరలోనే డివిజన్ లో పర్యటిస్తానని, గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతు నాయక్, జలేందర్ రెడ్డి, కృష్ణ మూర్తి, దొర బాబు, శేఖర్, ప్రసాద్, సుమన్, ప్రకాశ్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here