సిద్దిఖ్‌‌ నగర్ లో కార్పొరేటర్ హమీద్ పటేల్ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల సౌకర్యార్థం దశల వారీగా మౌలిక వసతుల‌‌ కల్పనకు‌ కృషి చేస్తామని కొండాపూర్ ‌డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ బస్తీలో స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ బస్తీ పాదయాత్ర చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మంజీరా మంచి నీటి లైన్ల సమస్యల పరిష్కారంలో భాగంగా చేపట్టిన మంజీరా మంచి నీటి పైపుల పునరుద్దరణ పనులను వాటర్ మేనేజర్ నివర్తి తో కలసి పరిశీలించారు.

సిద్దిఖ్ నగర్ లో సమస్యలు ‌తెలుసుకుంటున్న‌‌ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

సిద్దిఖ్ నగర్ లోని పలు వీధుల్లో మంచి నీటి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొన్ని చోట్ల పాత డ్రైనేజీ పైప్ లైన్లను తొలగించి కొత్త యూజీడీ పైపులైన్లను వేసేలా చూస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు పాటుపడుతున్నామని తెలిపారు. ఆయన‌ వెంట వాటర్ బోర్డు మేనేజర్ నివర్తి, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవరాజు, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, గణపతి, విజయ్, లక్ష్మి బాయి, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

సిద్దిఖ్ నగర్ లో చేపట్టిన మంజీరా మంచినీటి పైపులైన్ పనులను‌ పరిశీలిస్తున్న ‌కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here