ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ లో ఆర్ కే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రవి కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రయాణికులకు, పాదచారులకు చలివేంద్రాల ద్వారా ఉపశమనం‌ లభిస్తుందన్నారు. ప్రజల దాహార్తిని‌ తీర్చేందుకు ఆర్ కే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం అభినందనీయమని ‌అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్ గౌడ్, రాధా కృష్ణ యాదవ్, మాణిక్ రావు, శ్రీధర్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, సీతారామరాజు, గణేష్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, తిరుపతి, శ్రీనివాస్, రాము, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ లో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here