శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఒకే రాజ్యాంగం , ఒకే ప్రధాని, ఒకే చట్టం ఉండాలని ఆశించిన గొప్ప జాతీయవాది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. శ్యామ్ప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిదని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఇతర బీజేపీ నాయకులతో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులర్పించి, మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని , నెహ్రూ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370 చట్టాన్ని వ్యతిరేకిస్తూ , కేంద్రమంత్రి పదవి కి రాజీనామా చేసి జనసంఘ్ ను స్థాపించి దేశంలో ఒకే రాజ్యాంగం , ఒకే ప్రధాని, ఒకే చట్టం ఉండాలని ఆశించిన గొప్ప జాతీయవాదని, ఆయన స్పూర్తి తోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ 370, 35 -ఏ రద్దు చేయటం జరిగిందని గుర్తుచేశారు. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడేందుకు ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ప్రేరణాత్మకమని, విలువల కోసం కట్టుబడిన వారి జీవితం మనకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తిరుపతి, రమేష్, రంగస్వామి, మార్గ, సురేష్, విష్ణు, క్రాంతి, జీవ శ్రీను, రాజు యాదయ్య, శివ, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.