శిల్పావ్యాలీ అభివృద్ధికి సహకరిస్తాం

  • కాలనీ లో పర్యటించిన ప్రభుత్వ గాంధీ, కార్పోరేటర్ నాగేందర్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్పావాలీ కాలనీలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలను పరిశీలించారు. అలాగే కాలనీ వాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. కాలనీలో ఏర్పాటు చేసిన పార్కు ను పరిశీలించి పార్కులో అన్ని మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, డీఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, కాలనీ అధ్యక్షుడు సిద్దార్థ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి హరినాధ్ రెడ్డి, కార్యదర్శి రమకాంత్, లవకుమార్, ఈసీ మెంబర్లు వినయ్, రాము, రోషన్, మల్లారెడ్డి, వంశీ, డా. రాజా, గోపినగర్ బస్తీ కమీటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, బృంగి సుమన్, తదితరులు పాల్గొన్నారు.

శిల్పావ్యాలీలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here