మాతృశ్రీ నగర్ లో వ్యాక్సినేషన్ సెంటర్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీనగర్ లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ సౌజన్యంతో కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ప్రజలందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. ఒక్క రోజు వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేసిన‌ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాలనీలో మొక్కలను‌ నాటారు.‌ ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,‌ కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ కావూరి, నాగరాజ్, రవి, వాసు, పవన్, సతీష్, విజయ్, భాస్కర్ రెడ్డి, గోపి, యశోద హాస్పిటల్స్ డాక్టర్.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మాతృశ్రీ నగర్ లో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here