జాతీయవాదమే పరమావధిగా సేవలందిస్తున్న పార్టీ బిజెపి: మురళీధర్ రావు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనగూడ కినారా గ్రాండ్ లో బిజెపి జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి మురళీధర్ రావు సమక్షంలో పార్టీ ఎదుగుదల కోసం జాతీయవాదుల ఆత్మీయుల సమావేశ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.భారత రాజకీయాలతో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలు,‌ రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. వక్తలు పలు సూచనలు, సలహాలను వివరించారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ ఈ దేశంలో జాతీయవాదంతో కుల,మత, ప్రాంతీయ భేదాలు లేకుండా పని చేస్తున్న పార్టీ ఒక్క బిజెపి పార్టీ మాత్రమే అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మన దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలపాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి మోడీకి మన రాష్ట్రం నుండి తోడుగా నిలిచి జాతీయవాదులుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్, ప్రముఖులు రాజు, శ్రీనాథ్ రెడ్డి, జాతీయవాదులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న బిజెపి నాయకులతో మురళీధర్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here