శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కర్ణాటక గాత్ర కచేరి, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. నరేష్ విశాల్ శిష్య బృందం సభ్యులు కర్ణాటక గాత్రంలో రామదాసు సంకీర్తనలు, అన్నమయ్య కీర్తనలను ఆలపించారు.

భరత నాట్య ప్రదర్శనలతో ఆకట్టుకున్న అనురాధ శిష్య బృందం కళాకారులు

అనురాధ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన చేసి అందరిని అలరించారు. అలరింపు, నటేశ కౌతం, పుష్పాంజలి, మూషిక వాహన, అష్టలక్ష్మి, తిల్లాన, కాలభైరవాష్టకం, శివ తాండవం, భో శంభో, కంజదళయాదాక్షి తదితర అంశాలను మనస్విని, రుచిత, కావ్య, స్వాతి హన్సి, సహస్ర , ఖుషి, వర్ష , సమన్వి , లక్ష్మి క్షీర తదితరులు ప్రదర్శించారు.

కర్ణాటక గాత్ర కచేరి చేస్తున్న నరేష్ విశాల్ శిష్య బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here