చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. శంకర్ నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, కాలనీ అసోషియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్, జనరల్ సెక్రటరీ మానయ్య, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు, రాజ్ కుమార్, ట్రెజరర్ మల్లికార్జున్ రెడ్డి, అడ్వైజర్లు రవీందర్ రెడ్డి, రాములు, పున్నయ్య చౌదరి, బాబు, రమేష్, రియాజుద్దీన్ పాల్గొన్నారు.
