- టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుర్ల తిరుమలేశ్ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ మలి దశ ఉద్యమంలో దివంగత నేత కొండకల్ శంకర్ గౌడ్ పాత్ర మరవలేనిదని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రాణం పోసిన తెలంగాణ ఉద్యమ కారులు కొండకల్ శంకర్ గౌడ్ అని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. దివంగత కొండకల్ శంకర్ గౌడ్ 7వ వర్ధంతి సందర్భంగా తెరాస యువ నాయకులు గుర్ల తిరుమలేశ్ ఆధ్వర్యంలో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండకల్ శంకర్ గౌడ్ చిత్ర పటానికి ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, పలువురు కార్పొరేటర్లు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో శంకర్ గౌడ్ పాత్ర మరవలేనిదని అన్నారు. శేరిలింగంపల్లి లో ఎంతో మంది నాయకులను, ఉద్యమకారులను తయారు చేసిన ఘనత శంకర్ గౌడ్ కు దక్కిందన్నారు. మన మధ్య లేకున్నా ఏడేళ్లుగా తన గురువును మరవకుండా వర్థంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుర్ల తిరుమలేష్ ను ఎంపీ రంజిత్ రెడ్డి అభినందించారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదన్నారు. శంకర్ గౌడ్ జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండకల్ శంకర్ గౌడ్ కుమారుడు కొండకల్ మహేష్ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, నాయకులు మిరియాల రాఘవరావు, కసిరెడ్డి భాస్కర రెడ్డి, వాలా హరీష్ రావు, గంధం రాములు, డాక్టర్ వెంకట్ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, రామస్వామి యాదవ్, గంగాధర్ రావు , గుడ్ల ధనలక్ష్మి, కొండ విజయ్, మిద్దెల మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, జేరిపాటి రాజు, ప్రో. పి.వై రమేష్, ఆశీల శ్యామ్, ఆశీల శివ, దొంతి శేఖర్, కంది జ్ఞానేశ్వర్, గణేష్ రెడ్డి బాబు మోహన్ మల్లేష్, కలివేముల వీరేశం గౌడ్, ఉమ ప్రభాకర్, బాబుమియా, తాయర్, జమీర్, రాంబాబు, మధు, వెంకట్, ఎల్ వెంకటేష్, జమ్మయ్య, ధరం వీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
