నమస్తే శేరిలింగంపల్లి: టిఆర్ఎస్ శేరిలింగంపల్లి మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షాకీర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకులు బండకింది లీలానంద్ కుమార్ గౌడ్, పుట్ట శ్రీకాంత్ గౌడ్ ల ఆద్వర్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటలకు గోపినగర్ లో షాకీర్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. షాకీర్ భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, రంజిత్, రవి, గోపాల్, పృద్విరాజ్ రెడ్డి, భరత్, రాజేష్ సుంకరి, నవీన్ లు పాల్గొని షాకీర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
