శేరిలింగంపల్లి జనసేన పార్టీ ప్రాయశ్చిత్త దీక్ష

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు నూనెలు ఉన్నాయ‌ని, స్వామి వారికి ఆ ల‌డ్డూల‌ను నివేదించి అపవిత్రం చేసి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కళ్యాణ్ పిలుకు మేరకు చందానగర్ పరిధిలో ఉన్న శ్రీ వేంటేశ్వరస్వామి ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త దీక్షను నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ క‌ళ్యాణ్ వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తున్నారని, సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాల పైన యువతకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజవర్గ వివిధ డివిజన్ అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

దీక్ష చేస్తున్న జ‌న‌సేన పార్టీ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here