శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రుల సహకారంతో ముందుకు సాగుతున్నామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ 9.60 కోట్లతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






