శేరిలింగంపల్లి, మే 22 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహంను ఎల్లమ్మబండలో ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఆయన జీవితం అసమానం అని అన్నారు.. మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి , బహుజన నాయకుడు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేసి రాజకీయ , సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న జీవితం అసమానం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, మహిళలు , కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.