పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లను అందించిన కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న కేసీఆర్ రక్షణ కిట్లను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ శుక్రవారం అందజేశారు. పారిశుధ్య కార్మికులకు అండగా, రక్షణగా మన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. కరోనా కష్ట కాలంలో ఫ్రంట్ వారియర్స్ గా నిలబడి ప్రజలకు సేవలు అందించిన ప్రతి ఒక్క పారిశుధ్య కార్మికునికి అభినందనలు తెలిపారు. సమాజం పట్ల వారికున్న బాధ్యత మరువలేనిదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికుల కోసం ప్రభుత్వం, జీహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని అన్నారు. అలాగే కార్మికులు తమ స్వీయ భద్రతతో విధులను నిర్వహించాలని, తగిన రక్షణ ఏర్పాట్లతో మాత్రమే పనులను చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు దీపక్, ఎస్ ఆర్ పి రాజయ్య, ఎస్ ఎఫ్ ఏ మహేష్, పారిశుధ్య కార్మిక సిబ్బంది పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్ల ను అందజేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here