బండి సంజయ్ యాత్రకు విశేష స్పందన: బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్

నమస్తే శేరిలింగంపల్లి: నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి విముక్తి కోసం గడీల కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని బిజెవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పేర్కొన్నారు. ప్రజా ప్రజాసంగ్రామ పాదయాత్ర చింట్టపల్లి గేట్ నుండి వికారాబాద్ వరకు బండి సంజయ్ తో కలిసి‌ పాదయాత్ర చేశారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ , బిజెవైఎం గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు నక్కా శివ కుమార్, బిజెపి నాయకులు, పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here