ఆర్టీసీ కాలనీలో కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కార్పొరేటర్ పూజిత గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో చేపట్టిన ఉచిత వాక్సినేషన్ ప్రక్రియను స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ శనివారం పరిశీలించారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేలా ప్రకడ్బందీ చర్యలు తీసుకుంటామని, కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పద్మ రావు, దేవేందర్, ఎస్ఆర్ పీ గంగా రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కాలనీలో కరోనా వ్యాక్సినేషన్ ను పరిశీలిస్తున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here