సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కు వినతి

నమస్తే శేరిలింగంపల్లి: మియపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. భూగర్భ డ్రైనేజి కాలువ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడీ గాంధీ సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కార్పొరేటర్ శ్రీకాంత్ కు కాలనీ వాసులు అందజేశారు. కార్యక్రమంలో మయూరి నగర్ అసోషియన్ సభ్యులు అశోక్, నారాయణ రావు, వెంకట్, శ్రీనివాస్, కారుమంచు గణేష్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేసిన మయూరి నగర్ కాలనీ వాసులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here