శేరిలింగంపల్లి, మే 20 (నమస్తే శేరిలింగంపల్లి): తాడి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో జరుగుతున్న కుట్రను వ్వతిరేకించాలని కోరుతూ నగరంలోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ నెల 21న గురువారం ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కల్లుగీత వృత్తిని కాపాడుకుందాం, కార్పోరేట్ శక్తులను అడ్డుకుద్దామనే పిలుపుతో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.






