ఆర్ కె వై టీం ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలంలో విధులు నిర్వర్తించే జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గొడుగులను పంపిణీ చేయడం జరుగుతుందని బీజేపీ నాయకులు,ఆర్ కె వై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. మియపూర్ డివిజన్ లోని మక్తా గ్రామానికి చెందిన గుండె గణేష్ ముదిరాజ్ శనివారం సామాన్య ప్రజలకు, శానిటేషన్ వర్కర్లకు ఆర్ కె వై టీమ్ ప్రత్యేకంగా తయారు చేయించిన గొడుగులను అందజేశారు. ముందుగా నిరాశ్రుయులైన ప్రజలకు, పేదవారికి ఇచ్చిన అనంతరం పారిశుద్ధ్యకార్మికులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజెరావు శ్రీను, రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్ సిబ్బందికి‌‌ గొడుగులు పంపిణీ చేసిన ఆర్ కె వై టీం సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here