శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో నెలకొన్న ఫుట్పాత్ ఆక్రమణలను స్థానిక ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. దీప్తిశ్రీనగర్ ప్రాంతంలో ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు గాను ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.






