కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): అర్హత ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రుడు తమ ఓటును విధిగా నమోదు చేసుకొని, ఎమ్యెల్సీ ఎన్నికలలో ఓటును వేయాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కోరారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ హిల్స్ లో ఉన్న పలు అపార్ట్మెంట్స్ కు వెళ్లి పట్టభద్రులను కలసి ఎమ్యెల్సీ ఓటరు నమోదు దరఖాస్తులను నేరుగా వారికి అందజేసి, తప్పనిసరిగా ఓటును నమోదు చేసుకొని, ఎమ్యెల్సీ ఎన్నికలలో ఓటు వేయాలని అభ్యర్ధించారు. పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, ఫాం 18 ను వారికి అందజేశామని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2020/10/hamid-voter.jpg)
ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ మెంబర్ కరీం, తెరాస సీనియర్ నాయకుడు సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, సంపూర్ణ రెడ్డి, చోటం సింగ్, శివ కుమార్, సత్య ప్రకాష్, మల్లేష్, కలీం, యూత్ నాయకులు దీపక్, అస్లాం, రియాజ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.