నమస్తే శేరిలింగంపల్లి: ఆంధ్రప్రదేశ్ రెడ్డి వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా నియమితులైన చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి ని సోమవారం శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి, సహ అధ్యక్షుడు పోరెడ్డి సంజీవ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గున్నాల అనీల్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి తాడూరు, కార్యదర్శులు అజయ్ కుమార్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
